Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిన మెగా అభిమాని... ఇంటికెళ్లిన చిరంజీవి

Webdunia
ఆదివారం, 8 డిశెంబరు 2019 (15:46 IST)
సాధారణంగా మెగా కుటుంబానికి బలం.. బలగం, బలహీనత వారి అభిమానులే. అభిమానులే మా కుటుంబం అంటూ పలుమార్లు మెగా ఫ్యామిలీ హీరోలు పలు వేదికలపై ప్రకటించారు. అలాంటి అభిమానుల్లో కొందరు వీరాభిమానులు కూడా ఉన్నారు. అలాంటి వీరాభిమానుల్లో ఒకరైన నూర్ మహ్మద్.. ఇటీవల కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆయన ఇంటికెళ్లి బంధువులను పరామర్శించారు. 
 
తన వీరాభిమాని మరణం తీరని లోటని బాధను వ్యక్తం చేశారు. తోటి అభిమానులందరికీ బాధాకరమైన సంఘటన అని అన్నారు. ఆయన్ని తిరిగి తీసుకొని రాలేను కానీ, వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి కుటుంబ సభ్యులును ఓదార్చారు. అంతేకాకుండా, మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు కూడా స్పందించారు. 
 
'మా కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావించే ఓ అభిమాని మృతి చెందారు. నూర్‌ బాయ్‌ మా ఫ్యామిలీకి దగ్గరగా ఉండే వ్యక్తి. ఆయన మృతి మమ్మల్ని ఎంతగానో కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము' అని గీతా ఆర్ట్స్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
 
తనకు ఎంతో ఇష్టమైన అభిమాని మృతి విషయం తెలుసుకున్న అల్లు అర్జున్.. వెంటనే అభిమాని ఇంటికి వెళ్లి పరామర్శించి, నూర్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
 
'అభిమానులే మా కుటుంబం. మా ఫ్యామిలీని ఎంతగానో అభిమానించే నూర్ మహమ్మద్‌‌‌గారు లేరంటే ఎంతో బాధగా ఉంది. ఆయన సానుకూల దృక్పథం, సేవాగుణం ఇప్పటివారికి బెంచ్ మార్క్ వంటిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. 
 
'మెగా అభిమాన కుటుంబంలోని బలమైన మూల స్థంభం కుప్పకూలిపోయింది. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నాను. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. నూర్ భాయ్ ఆత్మకు శాంతిచేకూరాలి' అని సాయి తేజ్ వ్యాఖ్యానించారు. 
 
'మమ్మల్ని ఎంతగానో అభిమానించే నూర్ భాయ్ ఇక లేరని తెలిసి షాకయ్యా. ఎంతో బాధగా ఉంది. ఆయన మా కుటుంబంలోని మనిషి. మా పుట్టినరోజుల్ని ఆయన తన పుట్టినరోజుగా జరిపేవాడు. పండగల సమయంలో మంచి వంటకాలు పంపించి.. మాపై ఎంతో అభిమానాన్ని కురిపించేవాడు. ఆయన మృతి మా కుటుంబానికి తీరని లోటు' అని అల్లు శిరిష్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం: తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్‌కు ఇదో లెక్కా? (video)

పెళ్లాం తన మాట వినడం లేదని పెళ్లి కుదిర్చిన వ్యక్తిని పొడిచి హత్య చేసిన భర్త

ఏపీలో అత్యవసర పరిస్థితి నెలకొంది.. కస్టడీ టార్చర్‌పై జగన్మోహన్ రెడ్డి ఫైర్

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments