Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యావత్ తెలంగాణాకు చిన్నమ్మే : బోరుమని విలపించిన కిషన్ రెడ్డి

యావత్ తెలంగాణాకు చిన్నమ్మే : బోరుమని విలపించిన కిషన్ రెడ్డి
, బుధవారం, 7 ఆగస్టు 2019 (12:00 IST)
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందింది. ఆమె పార్థీవదేహాన్ని చూసిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కంటతడిపెట్టారు. సుష్మా స్వరాజ్‌ ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేపోతున్నట్లు ఉద్వేగానికి గురయ్యారు. 
 
'సుష్మాజీ నాకే కాదు.. యావత్తు తెలంగాణకు చిన్నమ్మే. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్రం వచ్చేలా చేసిన ఆమె కృషిని ఎన్నటికీ మరువలేము. ప్రజా సమస్యలపై ఆమె స్పందించే తీరు మాలాంటి వారికి స్ఫూర్తి. సుష్మాస్వరాజ్‌ ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అంటూ కిషన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 
 
కాగా, సుష్మా స్వరాజ్ భౌతికకాయానికి బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఆమె మృతి తీరని లోటు అని చెప్పారు. 
 
ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నారు. దేశం ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు, నేతల సందర్శానార్థం సుష్మ భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఉంచనున్నట్లు చెప్పారు.
 
 
ఈరోజు సాయంత్రం లోధీ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. సుష్మాకు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే  కుటుంబ సభ్యులు ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు. ఎయిమ్స్‌ వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అనారోగ్య కారణాలతో 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుష్మా స్వరాజ్ మృతికి కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం