Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చంటి" జోడి కాంబినేషన్‌లో 'దృశ్యం-2'.. సెట్‌లోకి అడుగుపెట్టిన మీనా

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (13:30 IST)
తెలుగులో హిట్ కాంబినేషన్‌గా పేరుగాంచిన విక్టరీ వెంకటేష్, మీనా జంట మరోమారు వెండితెరపై సందడి చేయనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన దృశ్యం-1కు సీక్వెల్‌గా దృశ్యం-2 రానుంది. 
 
మలయాళంలో మోహ‌న్ లాల్, మీనా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జీతూ జోసెఫ్ దృశ్యం 2ను తెరకెక్కించారు. ఈ విభిన్న‌మైన థ్రిల్ల‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. 
 
ఇప్పుడు దృశ్యం 2 చిత్రాన్ని తెలుగులోను రీమేక్ చేస్తుండ‌గా, మలయాళ మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్‌ తెలుగు సీక్వెల్‌కు నిర్దేశక బాధ్యతల్ని తీసుకున్నారు. డి.సురేష్‌బాబు, ఆంటోని పెరుంబపూర్‌, రాజ్‌కుమార్‌ సేతుపతి నిర్మిస్తున్నారు.
 
సోమవారం నుండి దృశ్యం 2  తెలుగు వ‌ర్షెన్ మొద‌లు కాగా, మీనా సెట్స్‌లో అడుగుపెట్టింది. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. పూర్ణ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 
 
జీతూ జోసెఫ్‌ తెలుగు ‘దృశ్యం 2’తో దర్శకుడిగా తెలుగుకి పరిచయం కానుండ‌గా, ఇందులో నదియా, నరేష్‌, ఏస్తర్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సతీష్‌ కురూఫ్‌, సంగీతం అనూప్‌ రూబెన్స్ అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెరుగుతున్న అప్పులు, చేతి రుణాలతో స్నేహితుల ఒత్తిడి.. వ్యక్తి ఆత్మహత్య

ప్రియుడితో పారిపోవచ్చుగా.. నా అన్న ప్రాణాలు ఎందుకుతీశావ్... శ్రష్టి (Video)

రూ.13 లక్షల వస్తువులతో క్యూడిన బ్యాగును తిరిగిచ్చేసిన ఆటో డ్రైవర్

ఇజ్రాయేల్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్...

గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యారు... గాల్లో వేలాడారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments