Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చంటి" జోడి కాంబినేషన్‌లో 'దృశ్యం-2'.. సెట్‌లోకి అడుగుపెట్టిన మీనా

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (13:30 IST)
తెలుగులో హిట్ కాంబినేషన్‌గా పేరుగాంచిన విక్టరీ వెంకటేష్, మీనా జంట మరోమారు వెండితెరపై సందడి చేయనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన దృశ్యం-1కు సీక్వెల్‌గా దృశ్యం-2 రానుంది. 
 
మలయాళంలో మోహ‌న్ లాల్, మీనా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జీతూ జోసెఫ్ దృశ్యం 2ను తెరకెక్కించారు. ఈ విభిన్న‌మైన థ్రిల్ల‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. 
 
ఇప్పుడు దృశ్యం 2 చిత్రాన్ని తెలుగులోను రీమేక్ చేస్తుండ‌గా, మలయాళ మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్‌ తెలుగు సీక్వెల్‌కు నిర్దేశక బాధ్యతల్ని తీసుకున్నారు. డి.సురేష్‌బాబు, ఆంటోని పెరుంబపూర్‌, రాజ్‌కుమార్‌ సేతుపతి నిర్మిస్తున్నారు.
 
సోమవారం నుండి దృశ్యం 2  తెలుగు వ‌ర్షెన్ మొద‌లు కాగా, మీనా సెట్స్‌లో అడుగుపెట్టింది. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. పూర్ణ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 
 
జీతూ జోసెఫ్‌ తెలుగు ‘దృశ్యం 2’తో దర్శకుడిగా తెలుగుకి పరిచయం కానుండ‌గా, ఇందులో నదియా, నరేష్‌, ఏస్తర్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సతీష్‌ కురూఫ్‌, సంగీతం అనూప్‌ రూబెన్స్ అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

మురుగు కాలువలో మహిళ మృతదేహం - ముక్కుపుడకతో వీడిన మిస్టరీ!

వీధి కుక్కలపై అత్యాచారం చేసిన దుండగుడు.. చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు..

బాపట్లలో రైల్వే విశ్రాంత ఉద్యోగితో వివాహేతర సంబంధం, పెట్రోలు పోసుకుని వాటేసుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments