మ‌న్మ‌థుడు 2 ఫ్యామిలీ ఇదే... సన్సేషన్ క్రియేట్ చేస్తారా?

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (20:24 IST)
అక్కినేని నాగార్జున కెరీర్లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రం మన్మథుడు. ఈ  సినిమా ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ క‌థ‌తో విజ‌య్ భాస్క‌ర్ ఈ సినిమాని తెర‌కెక్కించారు. ఈ సంచ‌ల‌న చిత్రానికి రెండో భాగంగా ఇప్పుడు మన్మథుడు 2 రాబోతుంది. చి.ల.సౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌ల పైన అక్కినేని నాగార్జున, పి.కిరణ్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. షూటింగ్ సెట్‌లో చిత్ర యూనిట్‌తో తీసుకున్న సెల్ఫీని నాగార్జున ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో నాగార్జునతో పాటు హీరోయిన్లు రకుల్, రష్మిక, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, రావు రమేష్, సీనియర్ నటి లక్ష్మి, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు కనిపిస్తున్నారు. మ‌రి... మ‌న్మ‌థుడు సినిమా వ‌లే మ‌న్మ‌థుడు 2 కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: ఒకే వేదికపై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ.. రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments