Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోతన మాటకు నిలువెత్తు నిదర్శనం మా బావ వైఎస్ఆర్ : మోహన్ బాబు

Webdunia
బుధవారం, 8 జులై 2020 (15:43 IST)
ప్రజానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని పలువురు సెలెబ్రిటీలు ఆయనకు నివాళులు అర్పించారు. అలాంటి వారిలో సినీ హీరో డాక్టర్ మోహన్ బాబు కూడా ఒకరు. ఆయన తన మనసులోని మాటను ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
వైఎస్సార్ స్నేహశీలి అంటూ కొనియాడారు. 'మాట తప్పలేరు మానధనులు' అన్న పోతన మాటకు వైఎస్సార్ నిలువెత్తు నిదర్శనం అంటూ అభివర్ణించారు.
 
"పేద ప్రజల దైవం మా బావగారైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నా" అంటూ మోహన్ బాబు స్పందించారు. 
 
అలాగే, ప్రముఖ సినీ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా తన నివాళులు ట్విట్టర్ ద్వారా అర్పించారు. "విలక్షణ రాజకీయచతురుడు, అవసరంలో వున్నవాళ్లకు అభయదాత, రైతన్నలకు ఆపద్భాంధవుడు పౌరుషానికి ప్రతినిధి , నిరుపేదల పాలిట ప్రత్యక్షదైవం, రాజకీయం అంటే వాగ్దానం చెయ్యడం కాదు, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం అని భావితరాలకు నేర్పిన ప్రజల ముఖ్యమంత్రి డా రాజశేఖరరెడ్డిగారి జయంతి నేడు. వందనాలు మహానుభావా" అంటూ ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments