Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండిగో విమానంలో మంచు లక్ష్మికి ఇబ్బందులు... ట్వీట్ వైరల్

ఠాగూర్
సోమవారం, 27 జనవరి 2025 (12:15 IST)
సినీ నటి మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో విమానయాన సంస్థ సిబ్బంది వైఖరి కారణంగా తాను తీవ్ర ఇబ్బందులు పడినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థకు చెందిన విమానంలో తాను ప్రయాణించగా.. ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ట్వీట్ చేశారు. సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ ఎక్స్ వేదికగా ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు.
 
తన లగేజ్ బ్యాక్‌ను పక్కకు తోసేశారని బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదనీ, వాళ్లు చెప్పినవిధంగా చేయకపోతే గోవాలోనే తన లగేజీని వదిలేస్తామని బెదిరించారని, సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని వాపోయారు. ఇదొక రకమైన వేధింపేనని తన కళ్లెదుట సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదని చెప్పారు. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా అని ఆమె ప్రశ్నించారు. 
 
ఈవిధంగా ఎయిర్ లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారని ఆమె ప్రశ్నించారు. ఇకపై తాను ఈ ఎయిర్‌లైన్స్‌కు దూరంగా ఉంటానని వెల్లడించారు. తనతోపాటు మరికొంతమంది ప్రయాణికులు ఇబ్బందులు పడినట్టు ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments