Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kerala: రిపబ్లిక్ డే పరేడ్- కుప్పకూలిపోయిన పోలీస్ కమిషనర్ (video)

Advertiesment
police

సెల్వి

, సోమవారం, 27 జనవరి 2025 (11:11 IST)
police
గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఛాతీలో విపరీతంగా నొప్పి, చెయ్యి, కాళ్ల నొప్పి, ఉదరం పైభాగంలో కనిపించే నొప్పి, వాంతులు, పంటినొప్పి, ఊపిరాడనట్టు ఉండటం, మెడపై ఒత్తిడి పెరగడం వంటి లక్షణాలుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కుప్పకూలిపోయారు. పరేడ్‌లో గవర్నర్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. 
 
తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా సీపీ థామ్సన్ జోస్ పడిపోయినట్లుగా వీడియోలో తెలుస్తోంది. వెంటనే అలర్ట్ అయిన అతని సహచరులు అంబులెన్స్‌‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్రలో అంతుచిక్కని వైరస్... గిలియన్ బేర్ సిండ్రోమ్‌ తొలి మృతి