Publish Date: Tue, 14 Jan 2025 (18:52 IST)
Updated Date: Tue, 14 Jan 2025 (18:57 IST)
శబరిమల వద్ద తమ జీవితకాలంలో ఒక్కసారైనా "మకర జ్యోతి"ని వీక్షించాలనే కోరిక అయ్యప్ప భక్తులకు వుంటుంది. ప్రతి సంవత్సరం, సంక్రాంతి పండుగ సందర్భంగా, శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నంబలమేడు కొండలలోని కాంతమల శిఖరంపై ఈ దివ్య కాంతి కనిపిస్తుంది.
సంక్రాంతి వేడుకల్లో భాగంగా, మకర సంక్రాంతికి పొన్నంబలమేడు కొండలపై మకర జ్యోతి కనిపించింది. మకర జ్యోతిని అయ్యప్ప భగవంతుని దైవిక అభివ్యక్తిగా భావించే వేలాది మంది భక్తులు పవిత్ర కాంతిని వీక్షించడంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. జ్యోతి కనిపించగానే "స్వామియే శరణం అయ్యప్ప" అనే మంత్రాలు శబరిమల కొండల గుండా ప్రతిధ్వనించాయి.
దాదాపు 1.5 లక్షల మంది భక్తులు మకర జ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించారని అంచనా. దీంతో శబరిమల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.