Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

ఠాగూర్
మంగళవారం, 17 డిశెంబరు 2024 (16:38 IST)
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదాన్ని పరిష్కరించేందుకు ఆయన భార్య మంచు నిర్మల రంగంలోకి దిగారు. మా ఇంట్లో మంచు మనోజ్ ఫిర్యాదులో నిజం లేదని, మంచు విష్ణు గొడవ చేయలేదని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా పహడి షరీఫ్ పోలీసులకు ఆమె ఓ లేఖ రాశారు. ఇంట్లో విష్ణు గొడవ చేసినట్టు జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పష్టత ఇచ్చారు. 
 
ఈ మేరకు ఆమె మంగళవారం పోలీసులకు రాసిన లేఖలో... ఈ నెల 14వ తేదీన నా పుట్టిన రోజు సందర్భంగా విష్ణు జల్‌పల్లిలోని మా ఇంటికి కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడని పేర్కొన్నారు. ఆ రోజు విష్ణు గొడవ చేశాడంటూ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేసినట్టు తనకు తెలిసిందన్నారు. ఇందులో నిజం లేదని పేర్కొన్నారు. ఆ రోజున మంచు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదన, బర్త్ డే సెలబ్రేషన్ తప్ గొడవ జరగలేదని చెప్పారు. 
 
ఇంటికి వచ్చి తన గదిలో ఉన్న వస్తువులను తీసుకుని, కాసేపు తనతో మాట్లాడి వెళ్ళాడని చెప్పారు. తమ ఇంటిపై మనోజ్‌కు ఎంత హక్కు ఉందో విష్ణుకు కూడా అంతే హక్కు ఉందని తెలిపారు. మనోజ్ ఫిర్యాదులో నిజం లేదని చెప్పారు. తాము ఇక్కడ పని చేయలేమని చెప్పి ఇంట్లో పని చేస్తున్న వాళ్లు మానేశారని, ఇందులో కూడా విష్ణు ప్రమేయం లేదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ఘటన- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం-దేశం వారి వెంట నిలుస్తుంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

Ahmedabad Plane Crash: ఏపీ వార్షిక విజయోత్సవాలు వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments