Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా మొఘ‌ల్ రామోజీరావు చేతుల మీదుగా 'మనలో ఒక్కడు' టీజ‌ర్ రిలీజ్

ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన 'మ‌న‌లో ఒక్కడు' టీజ‌ర్‌ను బుధ‌వారం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మీడియా మొఘ‌ల్ రామోజీరావు విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని యూనిక్రాఫ్ట్

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (17:03 IST)
ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన 'మ‌న‌లో ఒక్కడు' టీజ‌ర్‌ను బుధ‌వారం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మీడియా మొఘ‌ల్ రామోజీరావు విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జి.సి.జగన్ మోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్.రెడ్డి కథానాయికగా న‌టించారు. 
 
ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ మా సినిమా మీడియా నేప‌థ్యంలో సాగుతుంది. మా టీజ‌ర్‌ను మీడియా మొఘ‌ల్ రామోజీరావు విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ పూర్త‌యింది. కృష్ణ‌మూర్తి అనే సామాన్య అధ్యాప‌కుడి క‌థ ఇది. కొన్ని య‌ధార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా అల్లుకున్నాం అని అన్నారు.
 
నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ రామోజీరావుగారి చేతుల మీదుగా టీజ‌ర్ విడుద‌ల కావ‌డం మా అదృష్టం. ఆయ‌న టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌డ‌మే కాకుండా మా యూనిట్ స‌భ్యుల్ని ఆశీర్వ‌దించారు. ప్ర‌స్తుత స‌మాజంలో మీడియా పాత్ర ఏంటో మ‌నందరికీ తెలుసు. అలాంటి మీడియా నేప‌థ్యంలో సాగే క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాం. ఈ నెల 27వ తేదీన పాట‌ల్ని విడుద‌ల చేస్తాం. షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం అని చెప్పారు. 
 
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ రామోజీరావు స‌మ‌క్షంలో చిత్ర టీజ‌ర్ విడుద‌లైనందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నేను చాలా మంచి పాత్ర‌లో న‌టించాను. త‌ప్ప‌కుండా అంద‌రినీ అల‌రించ‌డ‌మే కాకుండా ఆలోచింప‌జేసే సినిమా అవుతుంది అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌టుడు జెమిని సురేశ్‌, కెమెరామెన్ ఎస్‌.జె.సిద్ధార్థ్‌, స‌హ నిర్మాత‌లు ఉమేశ్ గౌడ‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, క్రియేటివ్ హెడ్ గౌత‌మ్ ప‌ట్నాయ‌క్‌, గేయ ర‌చ‌యిత పుల‌గం చిన్నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments