Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత, చైతన్య ఆవిష్కరించనున్న 'మళ్ళీ రావా'

సుమంత్‌‌, ఆకాంక్ష సింగ్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మళ్ళీ రావా'. రాహుల్‌ యాదవ్‌ నక్క నిర్మాత. గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు. సెన్సార్‌ పూర్తయిన ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారంనాడు సమంత, నాగచైతన్య సంయుక్తంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (16:14 IST)
సుమంత్‌‌, ఆకాంక్ష సింగ్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మళ్ళీ రావా'. రాహుల్‌ యాదవ్‌ నక్క నిర్మాత. గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు. సెన్సార్‌ పూర్తయిన ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారంనాడు సమంత, నాగచైతన్య సంయుక్తంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత వెల్లడించారు. ఇటీవలే వైజాగ్‌లో ఆడియోను మధుర ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా మధుర శ్రీధర్‌ మాట్లాడుతూ.. చక్కటి ప్రేమకథా చిత్రమిది. 
 
'పెళ్లిచూపులు' తర్వాత ఇటువంటి కొత్త కథలు వస్తున్నాయి. ఇటీవలే వచ్చిన 'మెంటల్‌ మదిలో' ఇందుకు నిదర్శనం. ఆ కోవలోనే 'మళ్ళీ రావా' వుంటుంది. దర్శకుడు గౌతమ్‌ డెల్లాయిట్‌లో సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించాడు. చాలా క్లారిటీతో కథను తనే రాసుకున్నాడు. తనలో రచయిత వున్నాడు. సుమంత్‌కు 'గోదావరి' తర్వాత అంత మంచి చిత్రమవుతుందని నమ్ముతున్నానని' తెలిపారు.
 
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ... ఇటీవలే వైజాగ్‌లో విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన వచ్చింది. మధురంగా పాటలున్నాయి. డిసెంబర్‌ 8న సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు. నిర్మాత తెలుపుతూ... కథను తను ఏవిధంగా చెప్పాడో అదేవిధంగా తెరపై ఆవిష్కరించాడు. టేకింగ్‌ కొత్తగా వుంటుంది. సందర్భానుసారంగా పాటలున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఈరోజు సెన్సార్‌ పూర్తయింది. క్లీన్‌ యు సర్టిఫికెట్‌ ఇచ్చారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

జోగి రమేశ్ సతీమణి ధరించిన నెక్లెస్ ధర రూ.23 కోట్లా??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments