Webdunia - Bharat's app for daily news and videos

Install App

తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న హీరోయిన్!

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (09:25 IST)
తెలుగులో వచ్చిన చిత్రం "బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్". ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ అర్చనా కవి. ఈ మలయాళ బ్యూటీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారుపై మెట్రో రైల్ శ్లాబ్ కాంక్రీట్ పెళ్ళలు ఊడిపడటంతో ఆమె ప్రమాదంలో చిక్కుకున్నారు. అయితే, ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 
 
ఈ విషయంపై అర్చన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. తాను ప్రయాణిస్తున్న కారుపై మెట్రో శ్లాబ్ పెళ్లలు ఉన్నట్టుండి విరిగిపడ్డాయనీ, ఈ ప్రమాదం నుంచి తాను రెప్పపాటులో తప్పించుకున్నట్టు తెలిపింది. తాను విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు పేర్కొంది. 
 
ఈ ఘటనలో తన కారు పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. అందువల్ల కారుతో పాటు.. కారు డ్రైవర్‌కు కూడా మెట్రో రైల్ అధికారులు తగిన పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments