Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్‌బాబు, త్రివిక్రమ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ చిత్రం షూటింగ్ షురూ

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (15:54 IST)
trivikram-mehesh
మ‌హేష్‌బాబు, త్రివిక్రమ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ చిత్రం షూటింగ్ షురూ అయింది. నిన్న కృష్ణంరాజుగారి మృతి వ‌ల్ల షూటింగ్ ఒక‌రోజు వాయిదా వేసుకున్నారు. తాజాగా సోమ‌వారం నాడు హైద‌రాబాద్ శివార్లో షూటింగ్లో పాల్గొన్న‌ట్లు చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. ఈ సంద‌ర్భంగా త్రివిక్ర‌మ్‌, మ‌హేష్‌బాబుకు సీన్ వివ‌రిస్తున్న స్టిల్‌ను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది.
 
`అతడుస‌,  'ఖలేజా' తర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూడ‌వ సినిమా. దాదాపు 12 ఏళ్ళ త‌ర్వాత మ‌ర‌లా వీరి సినిమా సెట్స్ పైకి వ‌చ్చింది. ఈ చిత్రానికి వ‌ర్కింగ్ టైటిల్‌గా SSMB28గా పెట్టారు. ఎపిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్రీకరణ జ‌రుపుకుంటోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ చిత్రం 28 ఏప్రిల్,2023 లో విడుదల చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.  ఎస్.రాధాకృష్ణ ‌(చిన‌బాబు) నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రానికి  జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా,  కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments