Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్.. వెంకీ, చిరులతో ఓకే, మరి.. బాలయ్య, నాగ్‌లతో ఎప్పుడు?

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (15:04 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు..  సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ బాబుతో కలిసి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అన్నదమ్ములుగా నటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమా చేస్తుండటం విశేషం. మహేష్ మే నెలాఖరు నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. అయితే... మహేష్ బాబు... నాగార్జునతో కలిసి సినిమా చేయాలనుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందే సినిమాని గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించాలి అనుకున్నారు.
 
నాగార్జున, మహేష్ బాబు ఇద్దరికీ మణిరత్నం కథ చెప్పడం.. కథ విని నాగార్జున, మహేష్ ఓకే చెప్పడం జరిగిందని వార్తలు వచ్చాయి. అక్కినేని, ఘట్టమనేని ఫ్యామీలీ మధ్య మంచి అనుబంధం ఉండటంతో ఈ క్రేజీ మల్టీస్టారర్ గురించి వార్త బయకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు వస్తుందా..? సినిమా ఎలా ఉంటుంది..? అని నాగార్జున, మహేష్ అభిమానులు ఈ సినిమాపై ఎంతో ఇంట్రస్ట్ చూపించారు. 
 
అయితే... ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీలా కాకుండా థ్రిల్లర్ కథాంశంతో మణిరత్నం సినిమా తీయాలనుకున్నారు. దీంతో ఈ కథ వర్కవుట్ కాదేమో అని నాగ్, మహేష్ వేరే కథతో సినిమా చేద్దామని మణిరత్నంకు చెప్పడం వలన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు తెలిసింది.
 
ఇక చిరంజీవి సినిమాలో నటించేందుకు మహేష్ ఎందుకు ఓకే చెప్పాడంటే... కథ బాగా నచ్చడంతో పాటు మహేష్ కోసం డిజైన్ చేసిన క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండటంతో మహేష్ విన్న వెంటనే ఓకే చెప్పాడని తెలిసింది. 
 
స్టూడెంట్ లీడర్ పాత్రలో మహేష్ కనిపిస్తారని.. మహేష్ చెప్పే డైలాగులు స్టూడెంట్స్‌ని ఆలోచింపచేసేలా ఉంటాయని తెలిసింది. ఏది ఏమైనా మహేష్ చిరంజీవి సినిమాలో నటించడంతో ఈ ప్రాజెక్ట్ పైన మరింత క్రేజ్ ఏర్పడింది. ఆగష్టు 22న ఈ సినిమాని వరల్డ్ వైడ్‌గా చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి.. మహేష్.. బాలయ్య, నాగార్జునలతో కూడా భవిష్యత్‌లో సినిమాలు చేస్తాడని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments