Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు 'మహర్షి' మానియా మామూలుగా లేదుగా... తెలంగాణలో 5 షోలు...

Webdunia
బుధవారం, 8 మే 2019 (16:12 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన తాజా చిత్రం మ‌హ‌ర్షి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాని ఈ నెల 9న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు. దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు. అందుచేత పెట్టిన పెట్టుబ‌డి వెన‌క్కి వ‌స్తుందా రాదా అని కాస్త టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. అందుక‌నే తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్‌ని సంప్ర‌దించి అద‌నంగా మ‌రో షో వేసుకునేందుకు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌మ‌ని అడిగార‌ట‌. 
 
దీనికి తెలంగాణలోని అన్ని థియేటర్లలో ‘మహర్షి’ని 5 షోలు వేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలవుతున్న మే 9 నుంచి 14 రోజుల పాటు, అంటే మే 22 వరకు అన్ని థియేటర్లు రోజుకు 5 షోలు ఆడించవచ్చు.
 
వేసవి సెలవుల్లో ‘మహర్షి’ కోసం ప్రజలు అనేక అంచనాలతో ఎదురుచూస్తున్నారనీ, బ్లాక్ మార్కెటింగ్‌నీ, థియేటర్ల వద్ద జన సందోహాన్ని నిరోధించడానికీ, శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవకుండా ఉండటానికీ 5 షోలకు అనుమతినిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ త్రివేది ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ఉదయం 8 నుంచి 11 గంటల వరకు అదనపు ఆటకు అనుమతినిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లలకూ ఇది వర్తిస్తుందని తెలిపారు. ప్రభుత్వం రెండు వారాల పాటు పర్మిషన్ ఇచ్చినప్పటికీ అన్ని రోజులు 5 ఆటలు వేయకపోవచ్చు. కారణం అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్నందున తొలి వారం తర్వాత యధాతథంగా 4 ఆటలే ప్రదర్శించే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా 5 ఆటల పర్మిషన్‌తో ‘మహర్షి’కి రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రావ‌డం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

కర్ణాటకలో పరువు హత్య.. పూజారినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తెను చంపేసిన తండ్రి

Delivery Boy: డెలివరీ పర్సన్‌‌తో సహజీవనం చేసిన మైనర్ బాలిక.. తర్వాత ఏమైందంటే?

Raja Singh: నేను స్వతంత్ర ఎమ్మెల్యే... స్వేచ్ఛగా మాట్లాడగలను.. రాజా సింగ్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు - అక్టోబర్ వరకు రిజర్వ్‌లో తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

తర్వాతి కథనం
Show comments