Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే స్టేజ్‌పై సందడి చేయనున్న మహేష్ బాబు-జూనియర్ ఎన్టీఆర్

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (19:37 IST)
junior ntr
సూపర్ స్టార్లు ప్రస్తుతం బుల్లితెరపై మెరవడం ఫ్యాషనైపోయింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపై సందడి చేశారు. నాని కూడా బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బుల్లితెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. 
 
ఇంకో విశేషం ఏమిటంటే... సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఒకే స్టేజ్‌పై సందడి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ స్పెషల్‌ ఎపిసోడ్‌కు ప్రముఖ ఛానల్‌ భారీగా ప్లాన్‌ చేసినట్లు సమాచారం. 
 
ఆట నాది.. కోటి మీది అంటూ బుల్లితెర ప్రేక్షకులకు తారక్‌ చేరువయ్యారు. ఆయన హోస్ట్‌గా  ఎవరు మీలో కోటీశ్వరులు షో సాగుతోంది. ఈ షో ప్రారంభ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌ సందడి చేయగా.. సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో రాజమౌళి, కొరటాల శివ సైతం తమ ఆటతో మెప్పించనున్నారు. 
 
అలాగే దసరా కానుకగా ప్రసారం కాబోతున్న  "ఎవరు మీలో కోటీశ్వరులు" కార్యక్రమంలో మహేశ్‌బాబు స్పెషల్‌గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఎపిసోడ్‌ షూట్‌ జరగనుందని సమాచారం. దీంతో ఈ షో రేటింగ్ పెరిగే అవకాశం వున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments