Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్కీ బాయ్‌తో పెళ్ళంట.. నవ్వుకున్న మహేష్ బాబు- video

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (18:42 IST)
సంక్రాంతి బ్లాక్‌బస్టర్ సరిలేరు నీకెవ్వరు టీం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ప్రిన్స్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో పాటు సినీనటి విజయశాంతి, దర్శకుడు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, రాజేంద్రప్రసాద్, ఇతర చిత్ర బృందం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
 
దర్సనానంతరం ఆలయం బయటకు వస్తున్న మహేష్ బాబుతో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీలు పడ్డారు. కొంతమంది యువతులు సినిమా డైలాగ్ చెబుతూ మిల్కీ బాయ్‌తో పెళ్ళంట అంటూ గట్టిగా అరిచారు. దీంతో మహేష్ బాబు వారి మాటలకు ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు.
 
విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌లతో కూడా ఫోటోలను తీసుకునేందుకు భక్తులు ఎగబడ్డారు. అయితే టిటిడి విజిలెన్స్ సిబ్బంది ఫోటోలు తీసుకోనీయకుండా భక్తులను పక్కకు పంపేశారు. కొంతమంది భక్తులు దూరం నుంచి తమ సెల్ ఫోన్లలో సెల్ఫీలను తీసుకుంటూ కనిపించారు. సినిమా హిట్ కావడంతో సినీ యూనిట్ తిరుమల శ్రీవారిని దర్సించుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా తాను నటించిన సినిమా హిట్ అయితే మహేష్ బాబు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ వస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments