Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాయిదా పడిన మహర్షి 50 రోజుల వేడుక..

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (14:25 IST)
మహేష్ బాబు, పూజా హెగ్డే , అల్లరి నరేష్ ప్రధాన తారాగణంతో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం మహర్షి వేసవి కానుకగా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.


ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్వినీదత్‌ సంయుక్తంగా నిర్మించారు. యువకెరటం దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రం నేటితో (జూన్ 27)తో 50 రోజులు పూర్తి చేసుకుంది. 
 
ఈ సినిమా ప్రస్తుతానికి 200 కేంద్రాల్లో విజయవంతంగా న‌డుస్తుండ‌డంతో చిత్ర యూనిట్ జూన్ 28వ తేదీన హైదరాబాద్ శిల్పకళా వేదికగా 50 రోజుల వేడుకని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని భావించింది. కాగా ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల హఠాన్మరణంతో మహర్షి 50 రోజుల వేడుకను వాయిదా వేస్తున్నట్లు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. 
 
విజయ నిర్మల అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనుండగా సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మహర్షి 50 రోజుల వేడుక వాయిదా పడినట్లు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments