Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాయిదా పడిన మహర్షి 50 రోజుల వేడుక..

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (14:25 IST)
మహేష్ బాబు, పూజా హెగ్డే , అల్లరి నరేష్ ప్రధాన తారాగణంతో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం మహర్షి వేసవి కానుకగా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.


ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్వినీదత్‌ సంయుక్తంగా నిర్మించారు. యువకెరటం దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రం నేటితో (జూన్ 27)తో 50 రోజులు పూర్తి చేసుకుంది. 
 
ఈ సినిమా ప్రస్తుతానికి 200 కేంద్రాల్లో విజయవంతంగా న‌డుస్తుండ‌డంతో చిత్ర యూనిట్ జూన్ 28వ తేదీన హైదరాబాద్ శిల్పకళా వేదికగా 50 రోజుల వేడుకని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని భావించింది. కాగా ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల హఠాన్మరణంతో మహర్షి 50 రోజుల వేడుకను వాయిదా వేస్తున్నట్లు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. 
 
విజయ నిర్మల అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనుండగా సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మహర్షి 50 రోజుల వేడుక వాయిదా పడినట్లు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments