Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్కీబ్యూటీకి సైబర్ సెల్ సమన్లు.. ఎందుకబ్బా?

వరుణ్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (12:33 IST)
చిత్రపరిశ్రమలో మిల్కీబ్యూటీగా గుర్తింపు పొందిన తమన్నా భాటియాకు మహారాష్ట్ర సైబర్ సెల్ విభాగం సమన్లు జారీ చేసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్‌‍ కేసులో ఈ నెల 29వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆమెకు కబురు పంపించారు. మహాదేవ్ అనుబంధ సంస్థ ఫెయిల్ ప్లే యాప్‌ను గతంలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ ఆ యాప్‌ను ప్రమోట్ చేశారు. 
 
అయితే, గత యేడాది ఐపీఎల్ మ్యాచ్‌లను ఫెయిర్ ప్లే యాప్ చట్ట విరుద్ధంగా స్ట్రీమింగ్ చేసిందంటూ, దీనివల్ల తమకు కోట్లాది రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని ఐపీఎల్ ప్రసార హక్కులు పొందిన వయాకామ్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. 
 
కాగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‍‌కు కూడా ఇదే కేసులో ఈ నెల 23వ తేదీన హాజరుకావాలని సైబర్ సెల్ సమన్లు జారీ చేసింది. అయితే, తాను విదేశాల్లో ఉన్నందున ఆ రోజున విచారణకు హాజరుకాలేనని, తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు మరో తేదీ, సమయం పంపాలని సంజయ్ దత్ సైబర్ సెల్‌ను కోరిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments