Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలువుదీరిన కొత్త మా కార్యవర్గం - ప్రకాష్ రాజ్ - చిరంజీవి డుమ్మా

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (13:24 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కొత్త కార్యవర్గం శనివారం కొలువుదీరింది. అధ్యక్షుడు మంచు విష్ణు ఇప్పటికే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. శనివారం ఆయనతో పాటు ఆయన తరపున గెలిచిన సభ్యులు మా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
 
ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. పలువురు సినీ ప్రముఖులూ వచ్చారు. అంతకుముందు ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా కల్చరల్ సెంటర్‌లో కొత్త కార్యవర్గం సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజలో మంచు విష్ణు, నరేశ్, శివబాలాజీ, ఆయన భార్య మధుమిత, మాదాల రవి తదితరులు పాల్గొన్నారు.
 
ఈ కార్యక్రమానికి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు దూరంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం కూడా హాజరు కాలేదు. ఇటీవలి ఎన్నికల్లో విష్ణు ప్యానెల్‌కు చెందిన 15 మంది, ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లోని 11 మంది విజయం సాధించారు. 
 
అయితే, తదనంతర పరిణామాల నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులంతా రాజీనామా చేశారు. వీరి స్తానంలో ఎవరిని నియమిస్తారన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments