Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖుష్బూ ప్రాణాలను కాపాడిన "లార్డ్ మురుగన్" ... కారు ప్రమాదంలో జస్ట్ ఎస్కేప్...

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (11:26 IST)
ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన సినీ నటి ఖుష్బూకు బుధవారం తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ లారీ డీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక వైపు డోరు పూర్తిగా ధ్వంసమైంది. 
 
అయితే, సమయానికి ఎయిర్‌బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు. మరికొంతమందితో కలిసి వేల్‌ యాత్రలో పాల్గొనేందుకు కుష్బూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
 
ఈ ప్రమాదం చెన్నై నగర శివారు ప్రాంతంలోని మధురాంతకం అనే ప్రాంతంలో సంభవించింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయపటిన ఖుష్బూతో పాటు.. కారులోని మిగిలినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. 
 
ఈ ప్రమాదం తర్వాత ఖుష్బూ ఓ ట్వీట్ చేస్తూ, ఈ రోజు జరిగిన కారు ప్రమాదంలో తమను మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) స్వామి ప్రాణాలతో కాపాడారని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments