Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన లావణ్య త్రిపాఠి.. పవర్ స్టార్ సరసన ఆ సినిమాలో?

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (18:47 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది.. అందాల రాక్షసి. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ పింక్ సినిమాను తెలుగులోకి వకీల్ సాబ్‌గా రీమేక్ అవుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా బ్యాలెన్స్‌గా వున్న షూటింగ్‌ని ఏప్రిల్‌లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 
 
మే 15వ తేదీన ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేయనున్నారు. కానీ కరోనా కారణంగా లాక్ డౌన్‌తో ఏప్రిల్ 15 వరకు ఉండటంతో షూటింగ్ కూడా ఆపేశారు. దీంతో ఈ సినిమా రిలీజ్ మరింత వెనక్కి వెళ్లేలా కనిపిస్తోంది. ఇదిలా వుంటే క్రిష్ డైరెక్షన్‌లో చేస్తున్న పిరియాడిక్ చిత్రంతో పాటు పవన్ మైత్రీ మూవీమేకర్స్ చిత్రాన్ని కూడా అంగీకరించిన సంగతి తెలిసిందే. 
 
హరీష్ శంకర్ తెరకెక్కించనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇందులో పవన్‌కు జోడీగా ''అందాల రాక్షసి'' ఫేమ్ లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేసినట్టు తెలిసింది. గత కొంత కాలంగా బిగ్ సినిమా ఛాన్స్ దక్కించుకోలేకపోయిన లావణ్యకు నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సేనని సినీ పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

రాజధాని అమరావతి లేకుండా చేసావు జగన్, ప్రజలకు మండదా?: పవన్ కల్యాణ్

ఐదేళ్లలో 10 సార్లు కరెంట్ బిల్లులు పెంచిన జగన్ 27 వేల కోట్లు దోపిడి: పవన్ కల్యాణ్

దుబాయ్‌ను అతలాకుతలం చేస్తున్న శక్తివంతమైన తుఫాన్, ఒమన్ వరదల్లో 18 మంది మృతి - Video

27 ఏళ్లకే ప్రముఖ యూట్యూబ్ రివ్యూయర్ అబ్రదీప్ కన్నుమూత, కారణం అదే

గులకరాయి దాడి కేసులో ఉచ్చు బిగించే ప్రయత్నాలు : బోండా ఉమ

క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?

నువ్వులు, నువ్వుల నూనె ఆరోగ్య ప్రయోజనాలు

వేసవిలో చందన చూర్ణం ఉపయోగాలు

బెస్ట్ సమ్మర్ ఫుడ్స్ ఇవే

బార్లీ నీరు ఎండాకాలంలో ఎందుకు తాగాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments