హీరో రాజ్ తరుణ్ బంగారం దొంగిలించారు : లావణ్య ఫిర్యాదు!

ఠాగూర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (16:26 IST)
హీరో రాజ్ తరుణ్‌పై ఆయన మాజీ ప్రియురాలు లావణ్య చోరీ కేసు పెట్టింది. రాజ్ కిరణ్ బంగారాన్ని చోరీ చేశాడంటూ ఆరోపించింది. తన బంగారం, మంగళసూత్రం, దొంగిలించినట్టు ఆమె హైదరాబాద్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తాను కొనుగోలు చేసిన జ్యూవెలరీ షాప్ బిల్లులను కూడా సాక్ష్యాధారాలుగా చూపించారు. 
 
తన బంగారు నగలను బీరువాలో దాచానని, వాటి తాళం చెవిలు రాజ్ తరుణ్ వద్ద ఉందని ఫిర్యాదులో పేర్కొంది. తనకు తెలియకుండానే బీరావాలోని బంగారం దొంగిలించాడని తెలిపింది. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా సమర్పిస్తున్నట్టు తెలిపింది. రాజ్ తరుణ్ దొంగతనం చేసిన బంగారం విలువ రూ.12 లక్షల వరకు ఉంటుందని పేర్కొంది. 
 
రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య గతంలోనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇపుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఉంటున్నాడంటూ ఆమె గతంలో చేసిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తయారు చేసిన చార్జిషీటులో రాజ్ తరుణ్ తప్పు చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, ఈ కేసులో రాజ్ తరుణ్ కోర్టును ఆశ్రయించి తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పొందిన విషయం తెల్సిందే. ఈ కేసు కొనసాగుతుండగా మరోవైపు, చోరీ కేసు పెట్టడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...

భర్తతో పిల్లలు కన్నావుగా.. బావకు సంతాన భాగ్యం కల్పించు.. కోడలిపై అత్తామామల ఒత్తిడి

Student: హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments