Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు మళ్లీ షాక్.. తీర్పు సోమవారానికి వాయిదా

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (13:14 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఇప్పటికే తెలంగాణలో విడుదలైంది. కోర్టు తీర్పు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విడుదలకు బ్రేక్ పడింది. వర్మ తనదైన శైలిలో ఈ సినిమాకు హైప్ తీసుకురావడం, ఏపీ సీఎం చంద్రబాబుని ఈ చిత్రంలో విలన్‌‍గా చూపటం వంటి అంశాలు వల్ల తెలంగాణలో ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్  తెచ్చాయి. కానీ ఏపీలో మాత్రం ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. 
 
అయితే ఏపీ మినహా మిగిలిన ప్రాంతాల్లో విడుదలైన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఓ వర్గానికి సంబంధించిన అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికలపై ఈ చిత్రం ప్రభావం చూపిస్తుందని కొందరు కోర్టును ఆశ్రయించడంతో... చిత్రాన్ని ఏపీ హైకోర్టు ఛాంబర్‌లో జడ్జిల కోసం ప్రదర్శించారు. సినిమాను చూసిన తర్వాత... తీర్పును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీంతో దర్శకనిర్మాతలు నిరాశకు గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిట్టిరెడ్డీ... మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో: కిరణ్ రాయల్

బీటెక్ బంగారు బాతుగుడ్డు కాదు, 6 నెలలకే ఔట్: 700 మందిని ఇన్ఫోసిస్ ఊస్టింగ్

తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ.. ప్రజలు చికెన్ తినొద్దు..

ఫిబ్రవరి 28న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్

అక్కా అంటూ ఇంట్లోకి వచ్చాడు.. కూతురుపై కన్నేసి కాటేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments