Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాజంలో మహిళలకు సరైన చోటు లేదు : మంచు లక్ష్మి

ఠాగూర్
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (12:06 IST)
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలకు ఎదురవుతోన్న వేధింపులపై జస్టిస్‌ హేమ కమిటీ నివేదికను ఉద్దేశించి నటి మంచు లక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్‌తో ఆమె మాట్లవాడుతూ, ఈ సమాజంలో మహిళలకు సరైన చోటు లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకున్నారు. హేమ కమిటీ రిపోర్ట్‌ గురించి తనకు పూర్తిగా తెలియదని చెప్పిన ఆమె.. సమాజంలో మహిళలకు సమానత్వం ఉండాలని తెలిపారు. అన్యాయం జరిగిన వెంటనే బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
 
ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఏ మహిళైనా ఎవరితోనూ తన ఇబ్బందిని  చెప్పకోలేక  ధైర్యం చేయలేదని అనిపిస్తేనే.. ఆమెను  ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నిస్తారని, అలాంటి వారికి నో చెప్పడం నేర్చుకోవాలన్నారు. కెరీర్‌ మొదలుపెట్టిన సమయంలో తననూ కొందరు ఇబ్బంది పెట్టినట్లు.. వారితో తాను దురుసుగా ప్రవర్తించిన క్రమంలో ఉద్యోగాన్ని పోగొట్టుకున్నట్లు మంచు లక్ష్మి తెలిపారు. ఇక కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన తనని షాక్‌కు గురిచేసిందన్నారు. న్యాయం జరగాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం