Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.50 కోట్ల దావా వేసిన మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్!!

ఠాగూర్
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (11:42 IST)
ఓ కార్ల కంపెనీపై మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన హీరోయిన్ రిమీ సేన్ రూ.50 కోట్లకు దావా వేశారు. మెగాస్టార్ చిరంజీవి "అందరివాడు" సినిమాలో రిమీ సేన్ నటించారు. తాజాగా ఆమె తన రేంజ్ రోవర్ కారులో అనేక సమస్యలను ఎదుర్కొన్న క్రమంలో కారు ఉత్పత్తిదారులపై దావా వేసింది. లీగల్  చర్యల్లో  భాగంగా, నవనీత్ మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ, సతీష్ మోటార్స్‌లకు నోటీసులు పంపించారు. నోటీసు ఆమె అసలు పేరు, సుభమిత్ర సేన్ అని పేర్కొన్నారు. 
 
ఆగష్టు 25, 2022న, రిమీ సేన్ తన కారు వెనుక కెమెరా పనిచేయకపోవటంతో.. రివర్స్ చేస్తున్నప్పుడు పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనకు ముందు కూడా రిమీ సేన్ కారుతో అనేక సమస్యలను ఎదుర్కోవటం.. వాటిని పరిష్కరించే ప్రయత్నంలో అనేక సార్లు సంబంధిత డీలర్‌షిప్‌లను సందర్శించినా కానీ సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. 
 
తన వాహనంతో నిరంతర సమస్యలతో విసుగు చెందిన తరుణంలో మానసిక వేదనను గురయ్యానంటూ పరిహారంగా తనకు‌‌ నష్టపరిహారం ఇవ్వాలని లీగల్ నోటీసులను జారీ చేసింది.  కారులో సమస్యల కారణంగా డీలర్ షిప్, కారు తయారీదారుల నుండి 50 కోట్లు పరిహారంతో పాటు వారిపై చట్టపరమైన ఖర్చులను నిమిత్తం మరో రూ.10 లక్షలు ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments