Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సినిమాను అగ్ర‌స్థానంలో నిలిపిన కేవీ రెడ్డి

Webdunia
గురువారం, 1 జులై 2021 (12:55 IST)
KV reddy- Savitri
జూలై 1న కేవీ రెడ్డి జయంతి. ఆయ‌న గురించి కొన్ని విష‌యాలు. తెలుగు సినిమాలో వున్న అన్ని క‌థ‌ల‌ను తీసిన ద‌ర్శ‌కుడు, నిర్మాత‌ కె.వి.రెడ్డి. పూర్తిపేరు కదిరి వెంకటరెడ్డి. స్క్రీన్ ప్లే రచయిత కూడా. తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే కాలంలో విజయవంతమైన, విమర్శకులు ఆణిముత్యాలుగా అభివర్ణించిన పలు సినిమాలు తీసిన దర్శకుడు. అతను దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవే. 
 
పాతాళ‌భైర‌వి ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. 200రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా అదే. 10 సెంట‌ర్ల‌లో వంద‌రోజులు, 5 సెంట‌ర్ల‌లో 175 రోజులు ఆడింది. ఈ సినిమా త‌మిళంలో కూడా విడుద‌లై అఖండ విజ‌యాన్ని సాధించింది.  ఇక ఆయ‌న నేతృత్వంలో రూపొందిన `మాయాబ‌జార్‌` ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్‌. అందులో శ్రీ‌కృష్ణుడు అవ‌తారంలో ఎన్‌.టి.ఆర్‌.కు ఓ మైలురాయిలా నిలిచింది. ఈ సినిమా ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లో ఎవ‌రెస్ట్‌లా నిలిచింద‌నే చెప్పాలి. తొలి చిత్రం ‘భక్త పోతన’లోనే తెలుగు సినిమాకు కావలసిన కొత్త గ్రామర్ ను తీసుకు వచ్చారు  చారిత్రక, జానపద, పురాణాలు, సాంఘికాలతో ఆయ‌న ప్ర‌యోగాలు చేశారు. గూడవల్లి, బి.యన్.రెడ్డి వంటివారు కూడా తెలుగు సినిమా గ్రామర్ ను మార్చారు. వారికన్నా మిన్నగా కేవీ రెడ్డి బోధించిన సినిమా వ్యాకరణం జనానికి భలేగా పట్టేసింది. ‘జై పాతాళభైరవీ’ అన్నారు. అమ్మవారు, ‘నరుడా ఏమి నీ కోరిక’ అని ప్రశ్నించారు. జనాన్ని మెప్పించే చిత్రాలను తీయాలన్నదే తన అభిలాష అని చెప్పినట్టుంది. 
 
‘సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ గౌరీశంకరుల కథ, భాగ్యచక్రము’ వంటి చిత్రాలు చూసి, ఇవి కేవీ తీసిన సినిమాలేనా అని ఆ రోజుల్లో ఆశ్చర్యపోయిన వారున్నారు. కాల‌క్ర‌మేణా ఆయ‌న సినిమాలు కొంద‌రినీ ఆక‌ట్టుకోలేక‌పోయాయి. శ్రీకృష్ణార్జున యుద్ధం త‌ర్వాత ఆయ‌న సినిమాలు పెద్ద‌గా ఆద‌ర‌ణ నోచుకోలేక‌పోయాయి. జానపదాల ప్రసక్తి వచ్చిన ప్రతీసారి కేవీ బాణీ కోసం వెదుక్కోవలసి వస్తుంది. ఈ పరిస్థితి ఈ నాటి సినీజనానికీ తప్పడం లేదు. ఆయ‌న సినిమాలు ఎప్ప‌టినీ ఎవ‌ర్‌గ్రీనే. అందుకే మ‌హాన‌టి సినిమాలో కె.వి.రెడ్డి పాత్ర‌ను ద‌ర్శ‌కుడు క్రిస్ పోషించి గుర్తు చేశారు. విజ‌య‌వంత‌మైన సినిమాలు తీసిన ఆయ‌న 1972 సెప్టెంబ‌ర్ 15న కాలం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

బ్లాక్ బ్యూటీ మిస్ వరల్డ్ శాన్ రేచల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments