నేడు కనకమామిడి ఫామ్‌హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (09:32 IST)
అనారోగ్యం కారణంగా మృతి చెందిన తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. మొయినాబాద్‌, కనకమామిడి ఫాంహౌస్‌లో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. వీటిని తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. 
 
కాగా, అనారోగ్య సమస్యలతో పాటు పోస్ట్ కోవిడ్, కార్డియాక్ అరెస్ట్ కారణంగా కృష్ణంరాజు ఆదివారం వేకువజామున 3.25 గంటలకు హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. 
 
సోమవారం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచుతారు. ఆ తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తారు. వీటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్వయంగా పర్యవేహిస్తున్నారు. 
 
మరోవైపు, కృష్ణంరాజు పార్థివదేహాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు నటులు చిరంజీవి, పవన్, వెంకటేష్, మహేష్, సుమన్, మోహన్ బాబుతో పాటు అనేక మంది సినీ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదు.. గౌరవం వుంది.. మోదీ కిల్లర్: డొనాల్డ్ ట్రంప్ కితాబు

అబ్బా.. మొంథా బలహీనపడ్డాక.. తీరిగ్గా గన్నవరంలో దిగిన జగన్మోహన్ రెడ్డి

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments