Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొన్ని కుటుంబాల చేతిలో టాలీవుడ్ బందీగా ఉంది : అమలాపాల్

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (08:37 IST)
తెలుగు చలనచిత్ర పరిశ్రమ కొన్ని కుటుంబాల చేతిలో బందీగా ఉందని సినీ నటి అమలాపాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె తెలుగులో అతి తక్కువ సినిమాలే చేసింది. అలాంటి అమలాపాల్ టాలీవుడ్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లను గ్లామర్ పాత్రలకే పరిమితం చేస్తారని ఆరోపించారు. 
 
తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటి నుంచి టాలీవుడ్ కొన్ని కుటుంబాల చేతిలోనే ఉందన్న విషయం తనకు అర్థమైందన్నారు. ఆ కుటుంబాలే చిత్రపరిశ్రమపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించానని చెప్పారు.
 
వారు తీసే సినిమాలు భిన్నంగా ఉండేవని, వారి ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్లు ఉండేవారన్నారు. వారిని గ్లామర్‌గా చూపిస్తూ లవ్స్ సీన్స్, పాటలకు మాత్రమే పరిమితం చేసేవారని చెప్పారు. ఆ సినిమాలు చాలా కమర్షియల్‌గా ఉండేవన్నారు. అందుకనే తాను తెలుగు చిత్రపరిశ్రమకు దగ్గర కాలేక పోయినట్టు వివరించారు. 
 
పైగా, కెరీర్ ప్రారంభంలో అడిషన్స్, మీటింగులు వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. అదేసమయంలో తమిళం సినీ కెరీర్ ప్రారంభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. కానీ, కెరియర్ ప్రారంభంలో చేసిన రెండు చిత్రాలు ఇప్పటికీ విడుదల కాలేదన్నారు. ఆ తర్వాత నటించిన "మైనా" చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుందన్నారు. అలాగే, తాజాగా "కెడావర్" చిత్రం సినిమాలో నటించగా, అది ఓటీటీలో విడుదలైంది. 

సంబంధిత వార్తలు

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments