Webdunia - Bharat's app for daily news and videos

Install App

రారాజుకు వీడ్కోలు - ప్రారంభమైన కృష్ణంరాజు అంతిమ యాత్ర

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (14:01 IST)
పోస్ట్ కోవిడ్ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఆదివారం వేకువజామున మృతి చెందిన సీనియర్ నటుడు కృష్ణంరాజు అంతిమ యాత్ర సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ అంత్యక్రియలు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరుగుతున్నాయి. 
 
దీంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లోని కనకమామిడి ఫాంహౌస్‌లో కృష్ణంరాజు శాశ్వత విశ్రాంతి తీసుకోనున్నారు. అక్కడ ప్రభుత్వ అధికారక లాంఛనాలతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 
 
కనకమామిడి ఫాంహౌస్‌లోని బ్రౌన్ టౌన్ రిసార్టులో కృష్ణంరాజు అంత్యక్రియలను పూర్తి చేస్తారు. ఈ ప్రాంతానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే, అంత్యక్రియలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభిమానులతో పాటు మీడియాను కూడా రిసార్టులోనికి అనుమతించలేదు. అంతకుముందు జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు పార్థివదేహాన్ని పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

తెలంగాణాలో భారీ వర్షం... ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్

అమెరికాలో రోడ్డు ప్రమాదం - హైదరాబాద్ విద్యార్థిని దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లయింగ్ ఐసీయూ ఎయిర్ అంబులెన్స్‌ను ప్రారంభించాలని ICATT ప్రతిపాదన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

తర్వాతి కథనం
Show comments