Webdunia - Bharat's app for daily news and videos

Install App

రారాజుకు వీడ్కోలు - ప్రారంభమైన కృష్ణంరాజు అంతిమ యాత్ర

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (14:01 IST)
పోస్ట్ కోవిడ్ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఆదివారం వేకువజామున మృతి చెందిన సీనియర్ నటుడు కృష్ణంరాజు అంతిమ యాత్ర సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ అంత్యక్రియలు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరుగుతున్నాయి. 
 
దీంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లోని కనకమామిడి ఫాంహౌస్‌లో కృష్ణంరాజు శాశ్వత విశ్రాంతి తీసుకోనున్నారు. అక్కడ ప్రభుత్వ అధికారక లాంఛనాలతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 
 
కనకమామిడి ఫాంహౌస్‌లోని బ్రౌన్ టౌన్ రిసార్టులో కృష్ణంరాజు అంత్యక్రియలను పూర్తి చేస్తారు. ఈ ప్రాంతానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే, అంత్యక్రియలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభిమానులతో పాటు మీడియాను కూడా రిసార్టులోనికి అనుమతించలేదు. అంతకుముందు జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు పార్థివదేహాన్ని పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments