Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను భరించేందుకు సిద్ధమైన కృష్ణవంశీ.. ఎలాగో తెలుసా?

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (11:44 IST)
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ, సినీ నటి రమ్యకృష్ణ భార్యాభర్తలన్న విషయం తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చంద్రలేఖ', 'శ్రీ ఆంజనేయం' చిత్రాల్లో రమ్యకృష్ణ కనిపించింది. అలాగే ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో వారిద్దరితో కలిసి కృష్ణవంశీ కొత్త సినిమాను రూపొందించనున్నారు. 
 
ఈ సినిమా రంగమార్తాండ పేరుతో తెరకెక్కబోతోంది. ఇందులో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణలు ప్రధాన పాత్రలలో నటించబోతున్నారు. రెడ్‌బల్బ్ మూవీస్, హౌస్‌ఫుల్ మూవీస్, ఎస్వీఆర్ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. ఉత్తమ దర్శకుడిగా మూడు సార్లు నంది అవార్డులను సొంతం చేసుకున్న కృష్ణవంశీకి ప్రస్తుతం హిట్ సినిమాలు లేవు. 
 
దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ను కొట్టాలని భావించిన కృష్ణవంశీ ఓ మరాఠీ రీమేక్‌తో రాబోతున్నాడు. మరాఠిలో మంచి విజయం సాధించిన 'నటసామ్రాట్' రీమేక్‌కు కృష్ణ వంశీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇంకా ఈ సినిమాలో తన భార్య రమ్యకృష్ణను నటింపజేసి హిట్ కొట్టేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇందుకు రమ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments