Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కడా తగ్గేది లేదంటున్న కొరటాల

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (12:02 IST)
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ఆచార్య. భరత్ అనే నేను సినిమా తర్వాత చిరంజీవితో సినిమా చేయాలని కథ రెడీ చేసుకున్నాడు. చిరును కథతో మెప్పించాడు. అయితే... ఏ ముహుర్తాన ఈ సినిమా స్టార్ట్ చేసాడో కానీ... ఆచార్యకు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కరోనా కారణంగా ఆగిన ఆచార్య షూటింగ్‌ను 
ఈ నెలలో స్టార్ట్ చేయాలి అనుకున్నాడు.
 
ఇంతలో చిరంజీవి తనకు కరోనా వచ్చిందని.. ఇటీవల తనని కలిసినవాళ్లు కరోనా టెస్ట్ చేయించుకోండి అని సోషల్ మీడియా ద్వారా తెలియచేసి షాక్ ఇచ్చారు. 
 
దీంతో కొరటాల షాక్ అయ్యారు. అయితే... నిన్నటి నుంచి ఆచార్య షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. చిరంజీవి కరోనా అని ప్రకటించడంతో ఆచార్య షూటింగ్‌కి బ్రేక్ పడుతుంది అనుకున్నారు కానీ.. కొరటాల మాత్రం తగ్గేది లేదు అంటూ ఆచార్య షూటింగ్ స్టార్ట్ చేసారు.
 
చిరంజీవి లేని సన్నివేశాలను చిత్రీకరించారు. 2021 సమ్మర్లో ఆచార్యను ఎట్టి పరిస్థితుల్లోను రిలీజ్ చేయాల్సిందే అని పట్టుదలతో కొరటాల వర్క్ చేస్తున్నారు. ఇందులో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో చరణ్ కూడా ఆచార్య షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.
 
 మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments