Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

ఠాగూర్
ఆదివారం, 6 అక్టోబరు 2024 (14:57 IST)
స్వరాష్ట్రమైన కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన జోకర్.. ఇపుడు గెలుపు వీరులు కూర్చొనే వేదికపై కూర్చొని నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తమిళ నిర్మాత వినోద్ కుమార్ విమర్శలు గుప్పించారు. శనివారం రాత్రి చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి సమానత్వం గురించి మాట్లాడుతుంటే మరో రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి 'స' కారం గురించి మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. దీనికి తమిళ నిర్మాత వినోద్ కుమార్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 
 
తాజాగా ప్రకాష్ రాజ్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో ఓ వేదికపై కూర్చున్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ ఫొటోలో సీఎం స్టాలిన్‌, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివలు కూడా ఉన్నారు. ఈ ఫోటో షేర్ చేసి విత్ డిప్యూటీ సీఎం అని పెట్టారు. అయితే ఈ ఫోటోకి ప్రకాష్ రాజ్‌కి ఊహించని ట్వీట్ ఎదురైంది. 
 
'ఎనిమి', 'మార్క్ ఆంటోని' సినిమాలు నిర్మించిన నిర్మాత వినోద్ కుమార్ ప్రకాష్ రాజ్ ట్వీట్‌కి రిప్లై ఇస్తూ.. వాళ్లంతా ఎన్నికల్లో గెలిచారు. నువ్వు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయావు. నీకు వాళ్లకు అదే తేడా. పైగా, నీ వల్ల నాకు షూటింగ్ క్యాన్సిల్ అయి కోటి రూపాయల నష్టం వాటిల్లింది. చెప్పకుండా కారవాన్ నుంచి పారిపోయావు. కాల్ చేస్తానని చెప్పావు. ఇప్పటివరకు చేయలేదు అంటూనే జస్ట్ ఆస్కింగ్ పేరుతో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. మరో ట్వీట్‌లో ఒక జోకర్ తన స్వరాష్ట్రంలో పోటీ చేసిన ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు అంటూ విరుచుకుపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments