Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను హీరోయిన్‌ను... నిన్నే పెళ్లాడుతానంటూ యువకులకు టోకరా

పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసిన తమిళ నటి కోట్లాది రూపాయలకు పడగలెత్తింది. ఈ వ్యవహారంపై స్పందించిన తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (13:25 IST)
పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసిన తమిళ నటి కోట్లాది రూపాయలకు పడగలెత్తింది. ఈ వ్యవహారంపై స్పందించిన తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కోయంబత్తూరు జిల్లా పాపనాయకన్‌ పాళయం ధనలక్ష్మినగర్‌కు చెందిన శ్రుతి (21) అనే యువతి తమిళ చిత్ర పరిశ్రమంలో ఒకటిరెండు చిత్రాల్లో నటించి సినీ నటిగా ఉంది. ఈమె పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి విదేశాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, యువకుల వద్ద లక్షల్లో వసూలు చేసి ఉడాయించింది. 
 
ఇలాంటివారిలో సేలం జిల్లా ఎడప్పాడికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బాలమురుగన్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శృతి బండారం బయటపడింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు. 
 
శ్రుతితోపాటు ఆమె తల్లి చిత్ర, పెంపుడు తండ్రి ప్రసన్న వెంకటేశ్‌, తమ్ముడు సుభాష్‌ను కూడా అరెస్టు చేసి కోయంబత్తూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఆమె వద్ద జరిపిన విచారణలో అనేక మంది యువకులను పెళ్లి పేరుతో మోసగించి రూ.కోట్లు గడించినట్లు తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments