'రాజావారు రాణివారు' హీరో తదుపరి చిత్రం 'సమ్మతమే'

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (13:28 IST)
'రాజావారు రాణివారు' సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై ఆక‌ట్టుకున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్‌కు 'స‌మ్మ‌త‌మే' అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి గోపీనాథ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 
 
'క‌ల‌ర్ ఫొటో'లో హీరోయిన్‌గా త‌న క్యూట్ ప‌ర్ఫార్మెన్స్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన చాందిని చౌద‌రి ఈ చిత్రంలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం జోడీగా న‌టిస్తున్నారు. యు.జి. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కె. ప్ర‌వీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
సోమ‌వారం 'స‌మ్మ‌త‌మే' టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఓ యువ‌తి స్తంభానికి క‌ట్టేసి ఉంటే, వెనుక శ్రీ‌కృష్ణుడు క‌నిపిస్తున్నాడు. చాలా ఆహ్లాద‌క‌రంగా ఆక‌ట్టుకుంటోంది ఈ పోస్ట‌ర్‌. "ల‌వ్ ఈజ్ అన్‌కండిష‌న‌ల్" అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిట‌నే ఆస‌క్తి రేకెత్తుతోంది. స‌మ్మ‌త‌మే అంటే అంగీకారం అనే విష‌యం మ‌న‌కు తెలుసు.
 
ల‌వ్ డ్రామా మేళ‌వించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శేఖ‌ర్ చంద్ర సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, స‌తీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. విప్ల‌వ్ నైష‌దం ఎడిట‌ర్ కాగా, సుధీర్ మాచ‌ర్ల ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.
 
త్వ‌రర‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర వివ‌రాల‌ను చిత్ర బృందం వెల్ల‌డించ‌నున్న‌ది.
 
తారాగ‌ణం:
కిర‌ణ్ అబ్బ‌వ‌రం, చాందిని చౌద‌రి
 
సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, ద‌ర్శ‌క‌త్వం: గోపీనాథ్ రెడ్డి
నిర్మాత‌: కె. ప్ర‌వీణ‌
బ్యాన‌ర్‌: యు.జి. ప్రొడ‌క్ష‌న్స్‌
మ్యూజిక్‌: శేఖ‌ర్ చంద్ర‌
ఎడిటింగ్‌: విప్ల‌వ్ నైష‌దం
సినిమాటోగ్ర‌ఫీ: స‌తీష్ రెడ్డి మాసం
ఆర్ట్‌: సుధీర్ మాచ‌ర్ల‌
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments