Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క సినిమా కియారా అద్వానీ దశ మార్చింది... క్యూ కడుతున్న నిర్మాతలు

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (11:34 IST)
విజయ్ దేవరకొండ నటించిన చిత్రం "అర్జున్ రెడ్డి". ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోకి "కబీర్ సింగ్" పేరుతో తెరకెక్కించి రిలీజ్ చేశారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రంలో ఈమె నటనకు బాలీవుడ్ సినీ జనం ఫిదా అయిపోయింది. 
 
ఈ ఒక్క సినిమాతో కియారా అద్వానీ దశ తిరిగిపోయింది. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె కమిట్ అయిన పలు చిత్రాలతో రవ్వంత సమయం లేకపోయినప్పటికీ నిర్మాతలు మాత్రం ఆమె సమయం కోసం వేసి చూస్తున్నారు. 
 
పైగా, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా స్టార్‌ హీరోయిన్లుగా పేరు పడిన వారందరూ పెళ్ళిళ్ళు చేసుకుని స్థిరపడడంతో కియారాకు భలే గిరాకీ రావడానికి కూడా మరో కారణం. ఇదే అదునుగా భావించిన కియారా తన పారితోషికాన్ని డబుల్‌ చేసినా కిమ్మనకుండా ఇవ్వడానికి సిద్ధమైపోతున్నారు. 
 
బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు. మరి ఇంత డిమాండ్‌ ఉన్న కియారా ఇప్పట్లో తెలుగులో నటించే ఛాన్సే లేదనీ, అసలు తెలుగుకు దూరమైనా ఆశ్చర్యపోనవసరం లేదని బాలీవుడ్‌లో జనాలు అంటున్నారు. 
 
కాగా, తెలుగులో 'భరత్ అనే నేను' చిత్రంలో కియారా నటించింది. ఆ తర్వాత 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించినప్పటికీ అది ఆమెను నిరాశపరిచింది. అయినప్పటికీ ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లలో ఆమె డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments