Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క సినిమా కియారా అద్వానీ దశ మార్చింది... క్యూ కడుతున్న నిర్మాతలు

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (11:34 IST)
విజయ్ దేవరకొండ నటించిన చిత్రం "అర్జున్ రెడ్డి". ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోకి "కబీర్ సింగ్" పేరుతో తెరకెక్కించి రిలీజ్ చేశారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రంలో ఈమె నటనకు బాలీవుడ్ సినీ జనం ఫిదా అయిపోయింది. 
 
ఈ ఒక్క సినిమాతో కియారా అద్వానీ దశ తిరిగిపోయింది. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె కమిట్ అయిన పలు చిత్రాలతో రవ్వంత సమయం లేకపోయినప్పటికీ నిర్మాతలు మాత్రం ఆమె సమయం కోసం వేసి చూస్తున్నారు. 
 
పైగా, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా స్టార్‌ హీరోయిన్లుగా పేరు పడిన వారందరూ పెళ్ళిళ్ళు చేసుకుని స్థిరపడడంతో కియారాకు భలే గిరాకీ రావడానికి కూడా మరో కారణం. ఇదే అదునుగా భావించిన కియారా తన పారితోషికాన్ని డబుల్‌ చేసినా కిమ్మనకుండా ఇవ్వడానికి సిద్ధమైపోతున్నారు. 
 
బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు. మరి ఇంత డిమాండ్‌ ఉన్న కియారా ఇప్పట్లో తెలుగులో నటించే ఛాన్సే లేదనీ, అసలు తెలుగుకు దూరమైనా ఆశ్చర్యపోనవసరం లేదని బాలీవుడ్‌లో జనాలు అంటున్నారు. 
 
కాగా, తెలుగులో 'భరత్ అనే నేను' చిత్రంలో కియారా నటించింది. ఆ తర్వాత 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించినప్పటికీ అది ఆమెను నిరాశపరిచింది. అయినప్పటికీ ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లలో ఆమె డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments