Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిరోజే 22 కోట్లు రాబట్టిన 'కేసరి'

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (15:52 IST)
బాలీవుడ్ వైవిధ్య నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చారిత్రక నేపథ్యం కలిగిన సినిమా 'కేసరి' దేశవ్యాప్తంగా గురువారం విడుదలైంది. ఈ సినిమాను దేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించింది. 2019లో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఓపెనర్ సినిమాగా నిలిచింది. విడుదలైన తొలిరోజే ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. 
 
గురువారం విడుదలైన ఈ సినిమా భారతదేశ వ్యాప్తంగా 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ధర్మ ప్రొడక్షన్స్‌లో మొదటి రోజే ఇంత భారీ మొత్తంలో కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాను 1897లో జరిగిన సారంగడి యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించారు. ఇందులో అక్షయ్ కుమార్ హవల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో నటించాడు. అక్షయ్ కుమార్‌కు జోడీగా పరిణీతి చోప్రా నటించారు. విడుదలైన తొలి రోజే 22 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇలాగే బాగా ఆడితే భారతదేశంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల సరసన నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments