కథల ఎంపికలో తెలివిగా ఉన్నానంటున్న 'మహానటి'

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (13:18 IST)
Keerthy Sureshసీనియర్ నటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మహానటి'. ఈ చిత్రంలో నటించడం వల్ల కీర్తి సురేష్‌కు ఎక్కడలేని పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఒక్కసారిగా స్టార్‌డమ్ అమాంతం పెరిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె సినీ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. 
 
ఈ చిత్రం ఒక్క తెలుగులోనేకాకుండా తమిళంలో కూడా కీర్తి సురేష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. కీర్తీ నటన గురించి ఎవరు మాట్లాడినా 'మహానటి' చిత్ర ప్రస్తావనరాకుండా ఉండదు. ఆ చిత్రం తర్వాత కొన్ని కమర్శియల్‌ చిత్రాల్లో కీర్తి నటించినా ప్రస్తుతం తన నట జీవితం నిదానంగానే సాగిపోతోంది. 
 
ఈ క్రమంలో 'మహానటి' చిత్రం తర్వాత కీర్తి ఇప్పటివరకు కేవలం ఒక్కో చిత్రంలోనే నటించింది. ఇక తమిళంలో 'సర్కార్‌' చిత్రం తర్వాత మరో చిత్రం ఈ బ్యూటీ చేతిలో లేదు. ఇదే విషయాన్ని కీర్తీసురేశ్‌ ముందుంచితే దక్షిణాదిలో తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. ఇది సంతోషకరమైన విషయమేనని అంది. ప్రతీ చిత్రానికి ఎదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నట్లు పేర్కొంది. 
 
ఇక నటీనటులు వారు ఎంచుకునే కథలపైనే వారి మనుగడ ఆధారపడి ఉంటుందని అంది. కొందరు నటీమణులు పాత్రల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, అలాంటివారు ఎంచుకుని నటించే చిత్రాలపై ఆసక్తి అధికం అవుతుందని అంది.
 
'మహానటి' చిత్రం తర్వాత తన పరిస్థితి అదేనని చెప్పింది. తానిప్పుడు ఏ చిత్రంలో నటించినా వాటిపై ప్రేక్షకుల మధ్య అంచనాలు పెరిగిపోతున్నాయని చెప్పింది. అయితే మంచి నిర్ణయాలు తీసుకోవడం అన్నది తనకు చిన్నతనం నుంచే ఉందని అంది. అందుకే కథల ఎంపికలో చాలా తెలివిగా ఉన్నానని చెప్పింది. కథలో ఎంపికలో తొందర పడదలుచుకోలేదని తెలిపింది. తన విజయ రహస్యమని ఆమె చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments