Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

ఠాగూర్
శుక్రవారం, 23 మే 2025 (13:59 IST)
వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ప్రఖ్యాత మైసూర్ శాండల్ సబ్బుకు బాలీవుడ్ నటి తమన్నా భాటియాను ప్రచారకర్తగా నియమించడం కర్నాటకలో పెను దుమారానికి దారితీసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కర్నాటక సోప్స్ అండ్ డిటర్జంట్స్ లిమిటెడ్ తయారు చేసే ఈ సబ్బుకు ముంబై నటిని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసి, రెండేళ్ల కాలానికిగాను రూ.6.2 కోట్లు చెల్లించేందుకు సమ్మతం తెలిపింది. ఇపుడు ఈ డీల్ రాజకీయ దుమారం రేపుతోంది. 
 
తమ‌ రాష్ట్రానికి చెందిన మైసూర్ శాండల్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి తమన్నాను ఎలా నియమిస్తారంటూ కన్నడ సంఘాలు, స్థానిక కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. మైసూర్ శాండిల్ సోప్ కర్ణాటక సాంస్కృతికకు వారసత్వం అని.. అంతేకాకుండా ప్రాంతీయవాదానికి ఒక బ్రాండ్ అని పేర్కొంటున్నారు. అలాంటిది కన్నడ నటిని కాకుండా, బాలీవుడ్ నటిని ఎలా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటారని  ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
 
తక్షణమే తమన్నాతో ఒప్పందాన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అధికారికంగా లేఖ రాశారు. కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ్రు ఒక బహిరంగ లేఖలో నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈ నిర్ణయం అనైతికమైనది, బాధ్యతారహితమైనది, కన్నడిగుల మనోభావాల నుంచి డిస్కనెక్ట్ చేయబడిందని అభివర్ణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments