'కాంతార'కు కోర్టులో క్లియరెన్స్.. ఓటీటీలో 'వరాహ రూపం' పాట

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2022 (12:34 IST)
సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం "కాంతార". రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన హీరోగా నటించారు. సప్తమీ గౌడ హీరోయిన్. ప్రముఖ నిర్మాణం సంస్థ హోంబలే నిర్మించింది. సెప్టెంబరు నెలాఖరులో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుంది. కేవలం 25 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం అన్ని భాషల్లో కలుపుకుని పాన్ ఇండియా మూవీగా రూ.400 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. 
 
ఇటీవలే ఓటీటీలో కూడా విడుదలైంది. అయితే 'కాంతార'లో ఎంతో హిట్టయిన వరాహరూపం సాంగ్ ఒరిజినల్ వెర్షన్ ఓటీటీలో కనిపించకపోవడంతో వీక్షకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆ పాట కాపీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కేరళ కోర్టు ఆంక్షలు విధించింది. దీంతో ఆ పాట లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ వచ్చింది. 
 
తాజాగా కాంతారకు కోర్టులో క్లియరెన్స్ వచ్చింది. ఈ పాటపై గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేను తాజాగా ఎత్తివేసింది. దీనిపై దర్శకహీరో రిషబ్ శెట్టి స్పందించారు. ప్రజల ప్రేమాభిమానాల ఫలితంగా కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు. త్వరలోనే కాంతార ఓటీటీ వెర్షన్‌కు "వరాహరూపం" ఒరిజినల్ సాంగ్ జత చేస్తామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదు.. గౌరవం వుంది.. మోదీ కిల్లర్: డొనాల్డ్ ట్రంప్ కితాబు

అబ్బా.. మొంథా బలహీనపడ్డాక.. తీరిగ్గా గన్నవరంలో దిగిన జగన్మోహన్ రెడ్డి

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments