Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్డ్ డిస్క్ మాయం వెనుక ఎవరు ఉన్నారు?

ఠాగూర్
మంగళవారం, 27 మే 2025 (13:22 IST)
మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'కన్నప్ప'. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలకానుంది. అయితే, ఈ చిత్రం హార్డ్ డిస్క్‌ చోరీకి గురైంది. 'కన్నప్ప' చిత్రానికి సంబంధించిన హార్డ్ డిస్క్ అనుమతి లేకుండా తీసుకెళ్లారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఫిల్మ్ నగర్ పోలీసుల కథనం ప్రకారం.. కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్ కుమార్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 'కన్నప్ప' చిత్రానికి కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ వారు డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిల్మ్ నగర్‌లోని విజయ్ కుమార్ కార్యాలయానికి పంపారు. ఈ పార్శిల్‌ను ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకున్నాడు.
 
అతను ఈ విషయం ఎవరికీ చెప్పకుండా హార్డ్ డ్రైవ్‌ను చరిత అనే మహిళకు అప్పగించాడు. అప్పటి నుంచి వారు తప్పించుకుని తిరుగుతున్నారు. ఎవరి మార్గదర్శకత్వంలోనో.. తమ ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే దురుద్దేశంతో రఘు, చరితలు కలిసి ఇలా చేస్తున్నారని విజయ్ కుమార్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆప్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం - 600 మంది వరకు మృత్యువాత

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం: 622కి పెరిగిన మృతుల సంఖ్య, వెయ్యి మందికి గాయం

Chandrababu Naidu: సీఎంగా చంద్రబాబు 30 సంవత్సరాలు.. ఇంట్లో నాన్న-ఆఫీసులో బాస్ అని పిలుస్తాను

National Nutrition Week: జాతీయ పోషకాహార వారం.. ఇవి తీసుకుంటే?

ఇంటిలోని దుష్టశక్తులు పోయేందుకు మవనడిని నర బలిచ్చిన తాత...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments