Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఠాగూర్
ఆదివారం, 12 మే 2024 (17:39 IST)
బుల్లితెర నటి పవిత్ర జయరాం దుర్మరణం పాలయ్యారు. త్రినయని సీరియల్‌లో 'తిలోత్తమ'గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆమె ప్రయాణిస్తున్న కారు.. 44వ జాతీయ రహదారిపై భూత్‌పూర్ సమీపంలోని శేరిపల్లి వద్ద వెళుతుండగా, అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను గుద్ది.. ఆ తర్వాత ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. 
 
దీంతో ఈ కారులో ప్రయాణిస్తూ వచ్చిన పవిత్ర కుటుంబ సభ్యులు, మరో నటుడు చంద్రకాంత్‌లు గాయపడ్డారు. వీరిలో పవిత్ర మృతి చెందారు. మిగిలినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా, పవిత్ర జయరామ్ కర్ణాటకకు చెందిన నటి. ఆమె టీవీ సీరియల్ షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పవిత్ర మృతితో తెలుగు, కన్నడ టీవీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. జీ తెలుగు చానల్‌లో ప్రసారమయ్యే 'త్రినయని' సీరియల్‌లో పవిత్ర 'తిలోత్తమ' అనే నెగెటివ్ రోల్ పోషిస్తున్నప్పటికీ, ఆమెకు ఈ పాత్ర ద్వారా ఎంతోమంది అభిమానులయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments