కన్నడ నటి రాగిణి ద్వివేదికి ఊరట.. బెయిల్ మంజూరు

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (16:34 IST)
మాదకద్రవ్యాల వినియోగం కేసులో జైలుకు వెళ్లిన కన్నడ నటి రాగిణి ద్వివేదికి ఊరట లభించింది. ఈ కేసులో భాగంగా ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు గురువారం తీర్పునిచ్చింది. గతేడాది సెప్టెంబరులో.. ఓ డ్రగ్స్ పెడ్లర్తో నటి రాగిణి ద్వివేదికి సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి.
 
డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న నేపథ్యంలో మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద అక్టోబరులో ఆమెను అరెస్టు చేసి.. జైలుకు తరలించారు. ఆమెతో సహా ఈ కేసుకు సంబంధం ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
అయితే, తన దగ్గర డ్రగ్స్కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని అంటున్న సదరు నటి.. బెయిల్ కోసం నవంబరు 3న కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఆమెకు చుక్కెదురవ్వడం వల్ల.. ఆ తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో గురువారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు విన్న ధర్మాసనం.. రాగిణికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments