Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనికాకు నాలుగోసారి పాజిటివ్... ఆందోళనలో ఫ్యామిలీ మెంబర్స్

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (13:07 IST)
దేశంలో కరోనా వైరస్ బారినపడినవారిలో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు ఆమెకు నాలుగుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఈ నాలుగుసార్లూ పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆమెను ఇంటికి డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు ససేమిరా అంటున్నారు. దీంతో ఆమె కుటుబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
 
తాజాగా గాయని కనికా కపూర్‌కు నాలుగోసారి రక్తపరీక్షలు నిర్వహించారు. ఇందులో కూడా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. తాను ఐసీయూలో లేనని... తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన అందరికీ ధన్యవాదాలు అని తెలిపింది. 
 
తదుపరి పరీక్షలో తనకు నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నానని చెప్పింది. తన పిల్లలు, కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వేచి చూస్తున్నానని తెలిపింది. వారిని ఎంతగానో మిస్ అవుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.
 
కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఈ నెల 20వ తేదీన కనికాను ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. మార్చి 23, 27 తేదీల్లో నిర్వహించిన టెస్టుల్లో కూడా పాజిటివ్ అని తేలింది. ఆమెపై పోలీసు కేసు కూడా నమోదైంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments