Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ రంగంపై వివక్ష చూపుతున్న మహారాష్ట్ర సర్కారు : కంగనా ఫైర్

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (11:14 IST)
సినీ రంగంపై మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వివక్ష చూపుతోందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిందనీ, దీంతో పలు రాష్ట్రాలు సినియా థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చాయని, కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్దేశ్యపూర్వకంగానే థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వలేదని కంగనా ఆరోపిస్తున్నారు. 
 
దేశంలో క‌రోనా తగ్గుముఖం పట్ట‌డంతో అనేక‌ రాష్ట్రాలు థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతినిచ్చాయి. మహారాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం ఇందుకు అంగీక‌రించ‌పోవ‌డం సరికాద‌ని, సినీరంగంపై ఆ రాష్ట్ర స‌ర్కారు వివక్ష చూపుతోందని ఆమె ఆరోప‌ణ‌లు గుప్పించారు. 
 
ఇప్ప‌టికే చాలా సినిమాలు విడుదలకు సిద్ధ‌మ‌య్యాయ‌ని ఆమె అన్నారు. థియేటర్లు తెర‌వ‌డానికి ఒప్పుకోకుండా వాటిని పూర్తిగా మూసేయాలని ఆ రాష్ట్ర స‌ర్కారు భావిస్తోంద‌ని ఆరోపించారు.
 
మ‌హారాష్ట్ర పభుత్వం సినీ పరిశ్రమని వివక్షతో చూస్తున్నప్పటికీ దీనిపై ఎవరూ మాట్లాడ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌ని చెప్పారు. కాగా, కంగ‌నా ర‌నౌత్ న‌టించిన‌ ‘తలైవి’ సినిమా విడుద‌ల నేప‌థ్యంలోనూ మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌ను తెర‌వడానికి అనుమ‌తులు ఇవ్వ‌ని పరిస్థితి తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

Air India crash: మృతులకు కోటి రూపాయల నష్టపరిహారం.. 11A సీటులో వ్యక్తికి ఏమైంది?

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు రైతుల మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments