Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాలా కంఫర్టుగా ఉండే ప్రదేశం అదొక్కటే : కంగనా రనౌత్

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (12:05 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్‌లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్నారు. కరోనా లాక్డౌన్ తర్వాత ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఈ చిత్రం షూటింగ్ కోసం ఆమె చెన్నైకు వచ్చి, షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆదివారం జరిగిన షూటింగ్‌లో ఆమె పాల్గొంది. ఈ విషయాన్ని కంగనా తెలియజేస్తూ డైరెక్టర్‌ ఎ.ఎల్‌.విజయ్‌ తనకు సీన్‌ వివరిస్తున్న ఫొటోను షేర్‌ చేశారు. 
 
'టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ఎ.ఎల్‌.విజయ్‌ నాకు సీన్‌ను వివరిస్తున్నారు. ఈ ప్రపంచంలో అద్భుతమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కానీ చాలా కంఫర్ట్‌ అయిన ప్రదేశం ఏదైనా ఉందంటే అది ఫిలింసెట్‌ మాత్రమే' అని తన ట్విట్టర్ ఖాతాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. 
 
కాగా, బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ నెపోటిజం, డ్రగ్‌ మాఫియా తదితర అంశాలపై కంగనా రనౌత్‌ తనదైనశైలిలో స్పందించారు. దీంతో మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీ నేతలతో ఆమెకు వైరం ఏర్పడటంతో ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో ఆమె పోల్చారు. ఈ వ్యాఖ్యలను జీర్ణించుకోలేని శివసేన నేతలు కంగనా రనౌత్ సినీ కార్యాలయాన్ని కూల్చివేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments