Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇండియన్-2' సెట్స్‌లో క్రేన్ ప్రమాదంపై స్పందించిన కమల్ హాసన్

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (11:16 IST)
ఎస్.శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కుతోంది. విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో భారీ సెట్ వేశారు. అయితే, ఈ సెట్‌లో 150 అడుగుల ఎత్తునున్న క్రేన్‌ ఒక్కసారిగా తెగిపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సహాయకులు మృతి చెందగా, మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో డైరెక్టర్‌ శంకర్‌ సహాయకులు ఉన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 
 
అయితే, ఈ ప్రమాదంపై హీరో కమల్ హాసన్ స్పందించారు. సెట్స్‌లో జరిగిన ప్రమాదం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ప్రమాదంలో ముగ్గురు ప్రతిభావంతులను కోల్పోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన బాధ కంటే వారి కుటుంబీకుల బాధ ఎన్నో రెట్లు ఎక్కువని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు కమల్‌ తెలిపారు. వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments