Webdunia - Bharat's app for daily news and videos

Install App

"విక్రమ్" దండయాత్ర - రూ.300 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (11:27 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం "విక్రమ్". లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానరులో సహ నిర్మాత ఆర్. మహేంద్రన్‌తో కలిసి నిర్మించారు. ఈ నెల 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, మెగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. 
 
కమల్ హాసన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దీంతో గత నాలుగేళ్ళుగా ఆయన ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. అంటే నాలుగేళ్ల తర్వాత విక్రమ్ రిలీజ్ అయింది. ఎంతగానో ఎదురు చూస్తున్న కమల్‌కు ఈ చిత్రం మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఈ చిత్రం తొలి రోజు నుంచే భారీ వసూళ్లను రాబడుతోంది. ఫలితంగా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తూ రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. అదీ కూడా కేవలం 11 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. 
 
తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగులో హీరో నితిన్ రిలీజ్ చేశారు. రూ.7.48 కోట్ల థియేట్రికల్ వ్యాపారం జరుగగా, ఈ చిత్రం 11 రోజులు పూర్తయ్యే సరికి రూ.14.40 కోట్ల షేర్‌ను సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్‌లు కీలక పాత్రలను పోషించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments