Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్వస్థతకు లోనైన హీరో కమల్ హాసన్.. ఆస్పత్రిలో చేరిక డిశ్చార్జ్

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (09:20 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. హైదరాబాద్ నుంచి చెన్నైకు వచ్చిన తర్వాత ఆయన జ్వరం వచ్చింది. దీంతో చెన్నై పోరూరులో ఉన్న శ్రీ రామచంద్ర వైద్య ఆస్పత్రిలో బుధవారం రాత్రి చేరారు. ఆయనకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గురువారం ఉదయం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. రెండు రోజులు పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు.
 
ఇదిలావుంటే, తన కొత్త చిత్రం 'ఇండియన్-2' షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వెళ్లిన కమల్ హాసన్. లెజండరీ దర్శకుడు, 'కళాతపస్వి' కె.విశ్వనాథ్‌ను బుధవారం ప్రత్యేకంగా కలుసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని ఆయన నివాసానికి వెళ్లిన కమల్... కళాతపస్వి ఆశీర్వాదాలు తీసుకన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన చేతిని అందుకుని తన కళ్లకు అద్దుకుని, ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ ఆరోగ్యం గురించి కమల్ అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కమల్ హాసన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. "గురువుగారిని వారింట్లో కలిశాని, ఎన్నో మధుర స్మృతులను గుర్తు చేసుకున్నామనీ, వారంటే ఎంతో గౌరవం'' అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments