Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్ రెడ్డి కన్నుమూత

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (14:39 IST)
ప్రముఖ సినీ నిర్మాత, కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్ రెడ్డి (62) శనివారం కన్నుమూశారు. హృదయ సంబంధిత సమస్యతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. హృదయ సంబంధిత సమస్యతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారని.. అయినా చికిత్స ఫలించక శివప్రసాద్ రెడ్డి కన్నుమూసినట్లు వైద్యులు చెప్పారు. 
 
కాగా 1985లో కామాక్షి మూవీస్ బ్యానర్‌ను స్థాపించిన శివప్రసాద్ రెడ్డి అక్కినేని నాగార్జునకు పలు హిట్ సినిమాలు ఇచ్చారు. కార్తీక పౌర్ణమి, శ్రావణ సంధ్య, విక్కీ దాదా, ముఠామేస్త్రీ, అల్లరి అల్లుడు, ఆటోడ్రైవర్, సీతారామరాజు, ఎదురులేని మనిషి, నేనున్నాను, బాస్, కింగ్, రగడ, దడ, గ్రీకువీరుడు సినిమాలు నిర్మించారు. 
 
ఇకపోతే.. శివప్రసాద్ రెడ్డికి ఇద్దరు కుమారులు. ఆయన మృతితో తెలుగు సినీపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. శివప్రసాద్ రెడ్డి మృతి టాలీవుడ్‌కి తీరని లోటు అని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments